కోవిడ్ కారణంగా బాగా ఎఫెక్ట్ అయిన చిత్రాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం గత మూడేళ్ళ నుండి ప్రొడక్షన్ దశలోనే ఉంది. రెండు సార్లు కోవిడ్ వేవ్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని చివరికి ఫిబ్రవరి 4, 2022న విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు.
కానీ ఇప్పుడు అది కూడా డౌట్ లో పడింది. ఓమిక్రోన్ వేరియంట్ దేశంలో విజృంభిస్తోంది. మళ్ళీ చాలా రాష్ట్రాలలో థియేటర్లు మూతబడుతున్నాయి, వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ లాంటి మాటలు వింటున్నాం. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు వాయిదా పడ్డాయి.
కొందరు రిస్క్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య కూడా వాయిదా పడుతుంది అని అంటున్నారు. ఫిబ్రవరి 4 అంటే నెల రోజుల కూడా లేదు. అప్పటికి పరిస్థితులు సద్దుమణుగుతాయో లేదో కూడా క్లారిటీ లేదు. అందుకే వాయిదా తప్పదేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.