మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ రిలీజ్ ఆచార్య ఫుల్ రన్ ను పూర్తి చేసుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. దాదాపు 130 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం 50 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడని వారికి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ను ఒకేసారి చూడటం నిజంగా కనువిందు వంటిదే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్య డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది.
రీసెంట్ గా అమెజాన్ ఈ చిత్రాన్ని మే 20న తన ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెల్సిందే.
128578 636114In todays news reporting clever journalists function their own slant into a story. Bloggers use it promote their works and many just use it for enjoyable or to stay in touch with pals far away. 668565