హైదరాబాద్ ధూల్పేటకు చెందిన 9 మంది కుటుంబ సభ్యులు క్వాలీస్ వాహనంలో శ్రీశైలం వెళ్తున్న సమయంలో నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట వద్ద ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని లోయలో వాహనం పడింది. వాహనంలో ఉన్న 9 మందికి గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈగల పెంట సమీపంలోని మైసమ్మ గుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి50 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈగలపెంట జెక్ కో ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించడం జరిగింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించడం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న ఒకే కుటుంబంకు చెందిన వారు ఇలా ప్రమాదంకు గురి అవ్వడంతో స్థానికంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. రాత్రి సమయం అవ్వడం మరియు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
263960 342173Obtaining the proper Immigration Solicitor […]below you will find the link to some internet sites that we feel you ought to visit[…] 486147