విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. స్పీడ్గా వస్తున్న కారును అదుపు చేయడంలో విఫలం అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. ప్రమాదం బారిన పడ్డ వారిని కామినేని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైధ్యులు చెప్పడంతో వారిని నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. లాక్ డౌన్ సడలించడంతో వారు హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో ఇలా యాక్సిడెంట్కు గురి అయ్యి ప్రాణాలు కోల్పోయారు.
546272 52640I think other website proprietors ought to take this internet internet site as an example , extremely clean and fantastic user genial style . 386588
873097 627108Identified your weblog and decided to have a study on it, not what I generally do, but this blog is wonderful. Awesome to see a site thats not spammed, and actually makes some sense. Anyway, excellent write up. 735160