ఈరోజు నార్సింగి సర్కిల్ కార్యాలయంలో, నార్సింగి సర్కిల్ రెసిడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో స్థానిక నివాసితులు సంబంధిత అధికారులను కలిసి తమ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి, సైబరాబాద్ మునిసిపల్ నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి సమస్యను వివరించారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న వీక్లీ మార్కెట్ల వల్ల ప్రధాన కూడళ్లలో మరియు ట్రాఫిక్ అధికంగా ఉండే రహదారులపై తీవ్ర రద్దీ నెలకొంటోందని ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల సాధారణ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల వీక్లీ మార్కెట్లను ప్రధాన కూడళ్లలో మరియు ట్రాఫిక్ సమస్య ఉన్న రోడ్లపై నిర్వహించకుండా, వాహనాల రాకపోకలు లేని ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి అనుగుణంగా పరిమిత సంఖ్యలో స్టాల్స్ కేటాయించి, నియంత్రణతో నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రజల సౌకర్యం మరియు ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా తగిన చర్యలు తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను కోరారు.
ఇకనుంచి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నార్సింగి సర్కిల్ రెసిడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ముందుండి కృషి చేస్తుందని JAC ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు:
సి. వినోద్ కుమార్, ఎ. శ్రీనివాస్, పి. సాయి పవన్ కుమార్, పి. సతీష్ కుమార్, వి. సాయిరామ్ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం, ఎస్. మురళి రావు, ఎం. నాగరాజ్, ఎం. కామేశ్వరరావు, టి. విజయ్ కుమార్, ఎన్. నాగేశ్వరరావు, సమ్మి రెడ్డి, ఎ. సుధాకరరావు, జ్ఞానేశ్వర్ మైసరి పాల్గొన్నారు.
