Switch to English

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుర్తింపునిచ్చింది.

ఇదే బహుశా ఏబీఎన్ ఆర్కే జీర్ణించుకోలేకపోతున్నట్లుంది.! జనసేన పార్టీకి గుర్తింపు వచ్చాక, జనసేన పార్టీకి ఎన్నికల సింబల్‌గా గ్లాస్ గుర్తు ఫిక్స్ అయ్యాక.. ‘విలీన విషాన్ని’ ఆర్కే, జనసేన మీద ఎందుకు చిమ్ముతున్నట్లు.?

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో, మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ, చిరంజీవి కలిసి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు చిరంజీవి ఢిల్లీకి వెళ్ళారు.. ఆ సంబరాల్లో ప్రధానితో చిరంజీవి కలిశారు. ఇదీ జరిగిన విషయం.

ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచీ, చిరంజీవి మీద కడుపు నిండా విషాన్ని నింపుకున్న ఏబీఎన్ ఆర్కే, తాజాగా ప్రధాని మోడీని చిరంజీవి కలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. చిరంజీవి పేరుని ప్రస్తావిస్తూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. అంటూ ఓ ఫేక్ వార్తని వండి వడ్డించేస్తున్నారు ఏబీఎన్ ఆర్కే. ఈ మేరకు ఓ డిస్కషన్ కూడా తన మీడియా ఛానల్ ద్వారా షురూ చేశారు.

దేనికోసం ఇదంతా.? పదేళ్ళు జనసేన పార్టీ జనంలో వుండి, మార్పు కోసం కొట్లాడింది, బీజేపీలో విలీనం అయ్యేందుకా.? విలీనం కోసమే అయితే, అసలంటూ పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు కదా.! 2014 ఎన్నికల సమయంలోనే, బీజేపీ నుంచి పోటీ చేసి, పవన్ కళ్యాణ్ చట్ట సభలకు వెళ్ళి, కేంద్ర మంత్రి అయివుండేవారు. కానీ, పవన్ కళ్యాణ్ అలా చేయలేదు.

జనసేన పార్టీ ఈ పదేళ్ళలో పడ్డ స్ట్రగుల్ అంతా ఇంతా కాదు.! ఇది ఆర్కేకీ తెలియని విషయమేమీ కాదు. తెలిసీ, విషం చిమ్ముతున్నాడంటే ఏంటి అర్థం.? బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. అని ప్రస్తావిస్తున్న ఏబీఎన్ ఆర్కే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చంద్రబాబు.. అని రాసే సాహసం చేయగలడా.?

అన్నట్టు, ఇటీవల టీడీపీ నేత ఒకరు కోటి రూపాయలు ఖర్చు చేసి సాక్షి దినపత్రిలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో కూడిన ప్రకటన ఒకటి పబ్లిష్ చేయించిన సంగతి తెలిసిందే. దాంతో, టీడీపీపైనా ఆర్కే పగబట్టినట్లుంది. తనకు దక్కాల్సిన కోటి, సాక్షికి వెళ్ళడమేంటి.? అని ఆర్కే లోలోపల కుతకుతలాడిపోతున్నాడా.? అందుకేనా లోకేష్ – పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయంగా చిచ్చు పెట్టి, టీడీపీ – జనసేన పొత్తుని చెడగొట్టాలనుకుంటున్నది.? చేసిన పాపమంతా ఏబీఎన్ ఆర్కే చేసేసి, దాన్ని బీజేపీ మీద నెట్టేసి.. మూడు పార్టీల మధ్యా చిచ్చు పెట్టాలని ఆర్కే ఎందుకు అనుకుంటున్నాడు.?

ఒక్కటి మాత్రం నిజం.. ఆర్కే తెలంగాణ పైత్యమంతా, ఏపీ రాజకీయాలపై చూపిస్తున్నట్లే కనిపిస్తోంది.! చంద్రబాబు వీలైనంత వరకు ఏబీఎన్ ఆర్కేని దూరం పెట్టకపోతే కూటమి మధ్య ఆర్కే, ‘పచ్చ మీడియా’ ముసుగులో కుంపటి రాజేయడం ఖాయం.!

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో వుండటానికి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారు.?

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్...

ఏపీలో భారీగా ఎర్రచందనం పట్టివేత.. పవన్ కల్యాణ్‌ అభినందనలు..!

ఏపీలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎక్స్ లో పోస్టు చేస్తూ పోలీసులను అభినందించారు. అన్నమయ్య జిల్లాల్లో భారీగా ఎర్రచందనం...

ముద్రగడపై దాడి.! వైసీపీ పాత చింతకాయ పచ్చడి.!

జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎవరో, ముద్రగడ పద్మనాభంపై హత్యాయత్నానికి ప్రయత్నించాడట.! ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర భీతావహ వాతావరణం చోటు చేసుకుందట. ముద్రగడకి చెందిన వాహనం ధ్వంసమైందట,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...