Switch to English

ఏబీవీపై మళ్ళీ సస్పెన్షన్: వైసీపీ సర్కార్ ఏం సాధిస్తుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,793FansLike
57,764FollowersFollow

‘అర్థం పర్థం లేని ఆరోపణలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించగలరు.? న్యాయం నా వైపే వుంది. అది ప్రభుత్వంలో వున్నవారికీ తెలుసు. ఓడిపోతామని తెలిసి కూడా ప్రజా ధనాన్ని అనవసరంగా పెద్ద పెద్ద లాయర్ల మీద ఖర్చు చేస్తున్నారు..’ అంటూ ఆ మధ్య సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.!

ఏబీవీ చెప్పినట్లే, సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఏపీ సర్కారు వాదన వీగిపోయింది. ఏబీ వెంకటేశ్వరరావుకి తిరిగి పోస్టింగ్ దక్కింది. కాదు కాదు, విధిలేని పరిస్థితుల్లో ఏపీ సర్కారు పోస్టింగ్ ఇచ్చింది. కానీ, మళ్ళీ తనకున్న విచక్షణాధికారం పేరుతో ఏబీ వెంకటేశ్వరరావుపై కొద్ది రోజుల్లోనే సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ సర్కారు.

కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి కోర్టును ఆశ్రయిస్తారన్నది నిర్వివాదాంశం. ఆ తర్వాత ఏమవుతుందన్నది, ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషిస్తే తేలిగ్గానే అర్థమయిపోతుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంతో ఏపీ సర్కారు సాధించేదేంటి.? ప్రజా ధనం దుర్వినియోగమవడం తప్ప.?

అసలు ఇలాంటి కేసుల్లో వైసీపీ సర్కారు ఏ మేరకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.? అన్నదానిపై లెక్కలు తేలాల్సి వుంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేసే ఖర్చు కారణంగా ప్రజా ధనం దుర్వినియోగమవుతోందన్న ఆక్షేపణలు ఓ పక్క వ్యక్తమవుతోంటే, ఇంకోపక్క.. ఇలాంటి అర్థం పర్థం లేని కేసులతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేయడమేంటి.? అన్న ప్రశ్న సామాన్యుల్నీ ఆలోచనలో పడేస్తోంది.

ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేస్తే, ఆయనకు శిక్ష పడాల్సిందే. కానీ, మూడేళ్ళుగా కొండను తవ్వి ఎలకను సైతం పట్టలేని చందంగా.. ఆయన మీద సస్పెన్షన్ వేటు తప్ప.. ఆయన తప్పు చేశారని నిరూపించలేకపోయింది వైఎస్ జగన్ సర్కారు.

10 COMMENTS

సినిమా

శ్రీతేజ్ ను డిశ్చార్జి చేసిన డాక్టర్లు..

పుష్ప-2 ప్రీమియర్స్ షోలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను తాజాగా డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీతేజ్ గత ఐదు నెలలుగా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు....

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

రాజకీయం

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జనసైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీ...

మత్స్యకారుల సేవలో కూటమి.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..

ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి వెరైటీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. కథల...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ తర్వాత...