గోరంట్ల మాధవ్ తో వైసీపీకే నష్టమా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏరికోరి పోలీస్ పదవికి రాజీనామా చేయించి మరీ జగన్ తన పార్టీలోకి తెచ్చుకున్నారు మధవ్ ను. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి పార్టీకి జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాధవ్ న్యూడ్ వీడియో దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. దాన్ని కవర్ చేయడానికి నానా పాట్లు పడ్డా.. జనాలు మాత్రం అస్సలు నమ్మలేదు కదా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. అది వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది. దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది మహిళలు వైసీపీకి ఓటేయకుండా చీవాట్లు పెట్టారు.
మహిళలు అంతగా విమర్శలు గుప్పించడం వెనక జగన్ మౌనం కూడా ఉంది. అంత పెద్ద న్యూడ్ వీడియో ఘటన జరిగిన తర్వాత.. జగన్ కిసుమంతైనా యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే.. జగన్ గౌరవం పోకుండా ఉండేది. ఇంత చేసినా ఆయన్ను సమర్థించారు జగన్. అది పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు జగన్ వద్ద ఏదో మార్కులు కొట్టేయాలని మాధవ్ చేసిన అత్యుత్సాహం మరింత డ్యామేజ్ చేసేస్తోంది. జగన్ భార్య భారతిని టీడీపీ సస్పెండ్ చేసిన చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయాలని హిందూపురం నుంచి విజయవాడకు ఆగమేఘాల మీద వచ్చారు మాధవ్.
రావడమే ఆలస్యం నానా రచ్చ చేసేశారు. కిరణ్ మీద దాడి చేసే క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ ఆయన మీద కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారు. అంటే ఏదో చేయాలిన వస్తే ఇంకేదో జరిగిందన్నమాట. పైగా అరెస్ట్ చేశాక మాధవ్ వ్యవహరించిన తీరు మరింత విమర్శలకు దారి తీసింది. హాస్పిటల్ లో చెకప్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడటం.. ప్రెస్ మీట్ టైమ్ లో ముసుగు వేసుకోమంటే పోలీసులతో వాగ్వాదానికి దిగడం లాంటివి జరిగాయి. కోర్టు వద్ద ఆయన చూపించిన వ్యవహారి శైలి పోలీస్ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. గోరంట్ల విషయంలో ఇప్పటికే పది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
మొత్తానికి మాధవ్ తీరుతో పోలీసుల ఆగ్రహం.. ప్రజల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. అది పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తోంది. ఇంత జరిగినా సరే జగన్ మాత్రం గోరంట్ల విషయంలో మౌనంగానే ఉంటున్నారు. కనీసం ఆయన తీరును ఖండించకపోవడంతో వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. జగన్ భార్యను తిట్టాడనే కారణంతో చేబ్రోలు కిరణ్ ను టీడీపీ సస్పెండ్ చేసి కేసులు పెట్టి మరీ తమ విధానం ఏంటో నిరూపించుకుంది. కానీ మాధవ్ విషయంలో జగన్ ఇంత మౌనంగా ఉంటూ.. తమ విధానం ఇదే అన్నట్టు చూపించుకోవడం ఆయన పార్టీకే నష్టం అంటున్నారు రాజకీయ మేథావులు.