Switch to English

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,934FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన దర్శనమిచ్చింది. అసలేం జరుగుతోంది వైసీపీలో.!

నిజానికి, సాక్షి పత్రిలో నారా లోకేష్ ఫొటోతోగానీ, చంద్రబాబు ఫొటోతోగానీ టీడీపీ ప్రకటన అనేది వచ్చే అవకాశమే వుండదు. ప్రభుత్వ ప్రకటనలంటే.. అది మళ్ళీ వేరే చర్చ. పార్టీ ప్రకటనల పరంగా చూస్తే, టీడీపీని సాక్షి ఎప్పుడో బ్యాన్ చేసేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

కానీ, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (గతంలో ఈయన వైసీపీ నేతగా పని చేశారు), టీడీపీ ప్రకటనను సాక్షిల్లో ప్రచురించేలా చేయగలిగారు. అదీ ఫుల్ పేజీ ప్రకటన.. అందులో చంద్రబాబు, నారా లోకేష్ హైలైట్ అయ్యారు. కోటి సభ్యత్వాలకు సంబంధించిన ప్రకటన అది.

ఈ ప్రకటన చాలామంది వైసీపీ నేతలకు, కార్యకర్తలకు గుండెపోటు తెప్పించింది. తాము చూస్తున్నది సాక్షి పత్రికేనా.? లేదంటే, ఈనాడు లేదా ఆంధ్ర జ్యోతి పత్రికా.? అని గిల్లి మరీ చూసుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. సాక్షి పత్రికని చూసి.

‘మీరేమో వ్యాపార అవసరాలు, ఆర్థికావసరాలు చూసుకుంటారా.? మేమేమో పార్టీ కోసం ప్రాణాల్ని సైతం త్యాగం చేయాలా.? మేం, ఆర్థికంగా చితికిపోవాలా.? టీడీపీ, జనసేన పార్టీలకు శతృవుల్లా మారిపోవాలా.? మీరేమో, ఆ పార్టీల ప్రకటనలతో ఆర్థికంగా బలిసిపోతారా.?’ అని ప్రశ్నలు సంధిస్తూ వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో తమ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు పోస్ట్ చేశారు.

వీటిపై స్పందించడానికి వైఎస్ జగన్, అందుబాటులో లేరు.. విదేశాల్లో వున్నారాయన. పోనీ, గతంలో సకల శాఖ మంత్రిగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అందుబాటులో వున్నారా.? అంటే, ఆయనా గత కొంతకాలంగా అండర్ గ్రౌండ్‌లో వున్నట్లే వ్యవహరిస్తున్నారాయె. విజయసాయిరెడ్డి కావొచ్చు, వైవీ సుబ్బారెడ్డి కావొచ్చు.. వీళ్ళెవరూ క్యాడర్‌కి అందుబాటులో లేరాయె.

సరిగ్గా ఈ టైమ్‌లోనే వైసీపీకి రవిచంద్రారెడ్డి రాజీనామా చేశారు. అర్థం పర్థం లేకుండా, మీడియా ముందు వైసీపీ తరఫున నోరు పారేసుకునే స్కైమాక్స్ రవి అలియాస్ రవిచంద్రారెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడమేంటో ఎవరికీ అర్థం కాలేదు.

వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి అయితే, రవిచంద్రారెడ్డి రాజీనామాని తట్టుకోలేక ఓ వీడియో వదిలింది.. అందులో ఆమె ఏడ్చేసినంత పని చేసింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోయినా ఫర్లేదు, పార్టీకి రాజీనామా చేయొద్దంటూ విజ్ఞప్తి చేసేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డికి వున్నంత బాధ్యత కూడా వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులకు లేకపోవడం గమనార్హం. అధినేత వైఎస్ జగన్ సంగతి సరే సరి.

సినిమా

Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా...

Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో...

Thandel: బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. ఆర్టీసీ చైర్మన్ ఆగ్రహం

Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. పైరసీ సినిమాను ఇరకాటంలో పడేస్తోంది. సినిమా రిలీజైన రెండో రోజునే హెచ్...

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ...

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా అభిమాని.. ఎంతంటే?

Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. 62ఏళ్ల వయసులో ఆమె ఇటివలే...

పూర్తిగా మారిపోయిన సమంత.. కొత్త లుక్ చూశారా..?

సమంత అంటే అందానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టే ఉంటుంది. తన అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి సమంత ఇప్పుడు సడెన్ గా తన లుక్ మొత్తాన్ని ఛేంజ్ చేసేసింది. ఆమె...

దాతలకు ధన్యవాదాలు తెలిపిన సాయి దుర్గ తేజ్..!

రీల్ హీరోగా అందరు కనిపిస్తారు కానీ రియల్ హీరో అనిపించుకోవడం అన్నది చాలా అరుదు. అలాంటిది తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యకైనా తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలను కూడా సాయం...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న బడా సంస్థ..!

విక్టరీ వెంకటేశ్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్...

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...