ఇండియాలో టిక్టాక్కు కోట్లాది మంది బానిసలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లలు పెద్ద వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా టిక్టాక్ మోజులో పడి తమ పని వదిలి పెట్టి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కొన్ని లక్షల మంది ఇప్పటికే తమ జీవితాలను టిక్టాక్కు అర్పించారు. వారు టిక్ టాక్ లేకుంటే బతకలేము అన్నట్లుగా తయారు అయ్యారు. తాజాగా హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి టిక్టాక్కు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ రామాంతపురం ప్రాంతంకు చెందిన 17 ఏళ్ల గత కొన్ని నెలలుగా పూర్తిగా టిక్టాక్కు బానిస అయ్యి పోయింది. వేరే పని లేకుండా, చదువు లేకుండా టిక్టాక్ తోనే టైం గడిపేస్తుంది. దాంతో ఆమె తల్లి ఊరికే టిక్టాక్ చూడటంతో పలు సార్లు మందలించింది. ఎంత చెప్పినా కూడా వినక పోవడంతో ఫోన్ను లాగేసుకోవడంతో చేయి చేసుకుందట. దాంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపంకు గురై టిక్టాక్ లేకుండా ఉండలేను అంటూ ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా పోలీసులు కేసులో నమోదు చేశారు.