లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ నిలిచిపోవడంతో ఎందరో కార్మికులకు పని లేకుండా పోయింది. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారు. వీరి ఉపాధికి కూడా గండి పడింది. దీంతో వీరంతా స్వస్థలాలకు బయలుదేరారు. ఈమధ్య ప్రభుత్వాలు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది కానీ.. రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో నడుచుకుంటూనే ఇళ్లకు చేరిన వారి సంఖ్య చాలా ఎక్కువ. వారు ఎన్ని అవస్థలు పడ్డారో.. దారిలో ఆహారం దొరక్క ఎటువంటి బాధలు అనుభవించారో మనకు తెలుసు. ఇంకా కొంతమంది వెళ్తూనే ఉన్నారు.
వీరికి ప్రజలతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందించాయి. వీరిలో ఓ 99ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు. అంత వయసు మీద ఉన్నా వలస కార్మికుల కోసం తన వంతు సాయం అందించారు. ఇంట్లో ఉంటూ వారి కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని ప్యాక్ చేస్తూ తన వంతు బాధ్యత నిర్వర్తించారు. ఈ వయసులో ఆమె ఆమాత్రం ప్యాక్ చేయడం చిన్న విషయం కాదు. కానీ.. సాటి మనషికి సాయం అందించాలనే ఆమె గుణమే తనతో ఈ ఉడుతా సాయం చేయించింది.
ఈమె చేస్తున్న సాయాన్ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది జాహిద్ ఇబ్రహీం తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆమె మంచి మనసుకు సలాం అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో బాగా వైరల్ అయింది. నెటిజన్లు కూడా బామ్మ చేస్తున్న సేవను కొనియాడారు.
914218 423520I wish I had a dime for every bad post Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 499288
378526 256738fantastic post. Neer knew this, regards for letting me know. 882445