రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని సెంట్రల్ జైల్లో హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న దేవేందర్ శర్మ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం 20 రోజుల పెరోల్ మీద బయటకు వచ్చాడు. 62 ఏళ్లు దాటిన ఆ వ్యక్తి పెరోల్ గడువు ముగిసిన తర్వాత కూడా జైల్లో సరెండర్ కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎంత వెదికినా దొరకలేదు. వృద్దుడు అవ్వడంతో మృతి చెంది ఉంటాడా అనే అనుమానం కూడా వ్యక్తం అయ్యింది. కాని ఆ వ్యక్తి మృతి చెందలేదు. మళ్లీ హత్యలు చేస్తూ ఉన్నట్లుగా పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. దిల్లీ శివారు ప్రాంతంలో దేవేందర్ శర్మను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఆయుర్వేద చికిత్సలో పట్టబద్రుడు అయిన ఈయన మొదట వైధ్య వృత్తిని చేశాడు. ఆ తర్వాత ఈజీ మనీకి మోజు పడి హత్యలు చేయడం మొదలు పెట్టాడు. నకిలీ గ్యాస్ ఏజెన్సీ, మూత్ర పిండాలు అమ్మడం ఇంకా శరీర అవయవాలను కూడా అమ్మేయడం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని మర్డర్లు చేసి ఉంటావు అంటూ పోలీసులు ప్రశ్నించగా 50 మందిని చంపే వరకు లెక్క ఉంది. ఆ తర్వాత ఎంత మందిని చంపాను అనేది మాత్రం లెక్కపెట్టుకోలేదు అన్నాడు. అంటే అతడు వందకు పైగానే హత్యలు చేసి ఉంటాడు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి యావజ్జీవ శిక్ష కాదు ఉరి శిక్ష వేయాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
295883 37265I genuinely like your article. It is evident which you have a good deal information on this subject. Your points are properly made and relatable. Thanks for writing engaging and intriguing material. 427594
660698 546919Some truly nice stuff on this site , I like it. 535450