తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ ప్రతి వీకెండ్ లో కూడా భారీగా ఉంటుందనే విషయం తెల్సిందే. సమ్మర్ లో మొత్తంగా భారీ జనాలు రావడంతో తిరుమల తిరుపతి కొండలపై భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. శ్రీవారి హుండీ ఆదాయం ఒకప్పుడు కోటి వచ్చిందంటే చాలా గొప్ప విషయంగా ప్రచారం జరిగేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మొన్న ఆదివారం ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.6.18 కోట్ల ను మించింది.
ఆరు కోట్లను దాటడం ఇదే ప్రథమం అంటూ టీటీడీ అధికారికంగా ప్రకటించింది. శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఏడాదిలో అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. కరోనా సమయంలో టీటీడీ ఆదాయం చాలా తగ్గింది. కాని ఆ తర్వాత అనూహ్యంగా పెరిగింది. ఒక్క రోజులో ఆరు కోట్లకు పైగా హుండీ ఆదాయం అంటే మామూలు విషయం కాదు. దేశంలో ఏ దేవాలయంలో కూడా ఈ స్థాయిలో ఆదాయం రావడం లేదని భక్తులు అంటున్నారు.
220245 957393i could only wish that solar panels cost only several hundred dollars, i would love to fill my roof with solar panels- 767359