Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.! దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొన‘సాగు’తూనే వుంది. అదిగో.. ఇదిగో.. అంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయ్. వేల కోట్ల రూపాయల మేర అంచనా వ్యయం పెరిగిపోతూనే వుంది. అధికారంలో ఎవరున్నా, ‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి’ పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే వున్నారు.!
నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. అధికారులతో మాట్లాడారు. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించేశారట కూడా. ప్రాజెక్టు పనులు చూసుకుంటున్న మేఘా సంస్థ, ఆ ప్రాజెక్టు పక్కనే ఫైవ్ స్టార్ హోటల్ కడతామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిందట.
ఇది కదా ట్విస్ట్ అంటే.! పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ ఏంటబ్బా.? అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పుు కానే కాదు.! ఆ ప్రాంతం ‘రిమోట్ ఏరియా’. అయినాగానీ, ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ కట్టేస్తారట. తద్వారా టూరిజంని ప్రోత్సహించినట్లవుతుందట.
కాన్సెప్ట్ అదిరింది కదూ.! ఇంకెందుకు భూ కేటాయింపులు చేసేస్తే పోలా.? పోలవరం ప్రాజెక్టు ఎప్పటికైనా పూర్తి కానీ.. పూర్తి కాకపోనీ.. ఫైవ్ స్టార్ హోటల్ అయితే వచ్చెయ్యాలంతే.! అంతేనా.? ఇంకేమన్నా వుందా.?
కాస్త మొహమాటపడుతున్నారుగానీ, ఈపాటికే పోలవరం ప్రాజెక్టు సైట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి వుండేవారు. వంద, నూట పాతిక అడుగుల యెత్తైన వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ గతంలోనే ప్రకటించేసింది.
ఇదీ పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ చిత్తశుద్ధి.! చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పనులు దాదాపు 70 శాతం పూర్తయితే, మిగిలిన ముప్ఫయ్ శాతం పూర్తవడానికి నాలుగేళ్ళు సరిపోలేదు వైసీపీ సర్కారుకి.!