తైవాన్ లో శుక్రవారం ఉదయం ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తైతుంగ్ కు 350 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు తూర్పు తైవాన్ లోని టొరోకో జార్జ్ వద్ద పట్టాలు తప్పింది. రైలు పట్టాల పక్కనే నిలిపి ఉంచిన ఓ ట్రక్కు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తొలుత దానిని ఢీకొట్టిన రైలు.. అనంతరం పట్టాలు తప్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్రక్కు తునాతునకలు కాగా, రైలు ముందు భాగం సొరంగం వెలుపల ఉందని అధికారులు వెల్లడించారు. బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నట్టు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈశాన్య తైవాన్ వద్ద 2018లో జరిగిన రైలు ప్రమాదంలో 18 మంది మృతిచెందగా.. మరో 175 మంది గాయపడ్డారు.
778190 396749Youre so cool! I dont suppose Ive learn anything like this before. So good to locate any person with some authentic thoughts on this subject. realy thank you for starting this up. this site is something that is wanted on the internet, someone with just a little bit originality. beneficial job for bringing something new to the web! 532692
75953 933926I surely did not comprehend that. Learnt a thing new nowadays! Thanks for that. 969637