Switch to English

స్పెషల్‌: దేవకన్యను దివి నుండి భువికి తీసుకు వచ్చిన జగదేకవీరుడికి 30 ఏళ్ళు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,515FansLike
57,764FollowersFollow

ఇండియన్‌ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్నా అద్బుతమైన క్లాసిక్‌ చిత్రాలు వంద వరకు ఉంటాయి. అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉంటాయి. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఖచ్చితంగా ఉంటుంది అనడంలో అతి శయోక్తి లేదు. సినిమాను అప్పటి వరకు ప్రేక్షకులు చూస్తున్న తీరును మార్చేసిన చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచి పోయే ఈ చిత్రం చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికి ఒక అద్బుతమైన ఫాంటసీ చిత్రంగా నిలిచిపోయింది.

ఎన్టీఆర్‌ నటించిన జగదేక వీరుడి కథ లాంటి ఒక మంచి సినిమా తీయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాత అశ్వినీదత్‌ ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేయానుకున్నాడు. ఒకసారి తిరుపతిలో ఉన్న సమయంలో వైజయంతి మూవీస్‌కు చెందిన కో డైరెక్టర్‌ శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూలోకంకు వచ్చి ఉంగరం పోగొట్టుకోవడం, అది ఒక సామాన్యుడికి దొరుకుతుంది అనే లైన్‌ చెప్పాడట. ఆ లైన్‌ రాఘవేంద్ర రావుకు చెప్పడంతో వెంటనే కథ తయారి మొదలు పెట్టారు.

ఈ కథను జంధ్యాల, యండమూరి వీరేంధ్రనాధ్‌, సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్‌, క్రేజీ మోహన్‌ వంటి మహామహులు కలిసి కూర్చుని రెడీ చేశారు. ఇంతటి మహానుభావులు కలిసి కూర్చున్న తర్వాత కథ అద్బుతంగా కాకుండా మరెలా ఉంటుంది. రాఘవేంద్ర రావుకు ఈ గొప్ప రచయితల టీం అద్బుతమైన కథను అందించారు. భారీ బడ్జెట్‌ అవుతుందని ముందే ఊహించారు. అయినా కూడా అశ్వినీదత్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని నిర్మించారు.

ఆరున్నర నుండి ఏడు కోట్లల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని మొదట అనుకున్నా అది కాస్త 8 కోట్లకు పైచిలుకు అయ్యింది. అప్పట్లో అయిదు కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటేనే చాలా గొప్ప విషయం. 8 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే అప్పుడు సినీ ప్రముఖులు పలువురు నోరు వెళ్లబెట్టారు. రెండు మూడు పెద్ద సినిమాలు తీసేయవచ్చు, అంతటి ప్రయోగం అవసరమా అంటూ పెదవి విరిచారట. ఆ విమర్శలు, కామెంట్స్‌ పట్టించుకోకుండా అనుకున్నది అనుకున్నట్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

మహామహులను ఈ చిత్రంలో చూపించాడు. ఎన్నో పద ప్రయోగాలు చేయడంతో పాటు అప్పటి వరకు ఏ సౌత్‌ సినిమాలకు కూడా ఉపయోగించని గ్రాఫిక్స్‌ టెక్నాలజీ మరియు ఇతరత్ర టెక్నికల్‌ అంశాలను వినియోగించి ఒక విజువల్‌ వండర్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంకు ఇళయరాజా అందించిన సంగీతం ఒక అద్బుతం. ఆయన ఈ సినిమాకు గాను నంది అవార్డును అందుకున్నారు. సినిమాలోని ఆ పాట ఈ పాట అని కాకుండా అన్ని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రతి పాట కూడా దేనికి అదే అన్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా అబ్బనీ తీయని దెబ్బ మెలోడీ ట్యూన్‌తో సాగే మాస్‌ సాంగ్‌గా నిలిచింది.

సరికొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసిన ఈ చిత్రం మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌డంను మరింతగా పెంచడం జరిగింది. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాత శ్రీదేవిని అభిమానులు నిజంగా దేవకన్యలు ఇలాగే ఉంటారేమో అనుకున్నారు. అప్పటి నుండి కూడా శ్రీదేవికి అతిలోక సుందరి పేరు పడిపోయింది.

ఈ చిత్రంలో పిల్లలుగా నటించిన శాలిని, శామిలిలు ఆ తర్వాత కాలంలో హీరోయిన్స్‌గా కూడా నటించారు. అయితే వారు హీరోయిన్స్‌గా చేసిన సినిమాల కంటే కూడా ఈ చిత్రంతోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ చిత్రంలో ఇంద్రజ పాత్ర పోషించిన శ్రీదేవి చిరంజీవిని మానవా అంటూ పిలవడం అందరికి బాగా కనెక్ట్‌ అయ్యింది. ఈ చిత్రంలో కామెడీ సీన్స్‌ను జంద్యాల గారు అద్బుతంగా రాశారు.

సినిమాలోని ప్రతి సీన్‌ను కూడా రాఘవేంద్ర రావు తెరకెక్కించిన తీరు అమోఘం. ఈ చిత్రానికి గాను ఆయన ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

8 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో 13 కోట్లకు మించి వసూళ్లు సాధించింది. ఈ అద్బుత చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అయ్యింది.

తాజాగా నిర్మాత అశ్వినీదత్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ చేస్తానంటూ ప్రకటించడంతో అప్పుడే ఆ సీక్వెల్‌ గురించిన చర్చ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరియు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...