గురువారం మార్నింగ్ అప్డేట్:
గత సాయంత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, పోడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగు చేయడం కోసం ఓ 120 అడుగుల బోరు బావి లో సాయి వర్ధన్ అనే మూడేళ్ళ బాలుడు అందులో పడిపోయాడని తెలియజేసాం. అధికారులు రెస్క్యూ చేసే లోపే సాయి వర్ధన్ చనిపోవడం అతని తల్లి తండ్రులకి తీరని శోఖాన్ని మిగిల్చింది. సుమారు 17 అడుగుల లోతులో గురువారం ఉదయం 5:45 నిమిషాలకి సాయి వర్ధన్ కనిపించగా అతన్ని బయటకి తీశారు. అప్పటికే అతని ప్రాణాలు కోల్పోవడంతో ఈ కథ విషాదాంతమైంది. మరోసారి అధికారులు బోరుబావిలో పడిన పిల్లాన్ని కాపాడడంలో విఫలమయ్యారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇప్పటికీ మనం యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్స్ ని సీరియస్ గా తీసుకోకపోవడం బాధాకరం.
బుధవారం ఈవెనింగ్ రిపోర్ట్:
కొద్దీ సేపటి క్రితమే నల్గొండలో పవర్ ప్లాంట్ బ్లాస్ట్ జరిగింది. అది జరిగిన గంట లోపే మెదక్ జిల్లాలో ఓ మూడేళ్ళ బాలుడు పొలం సాగు కోసం వేసిన బోరు బావిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, పోడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగు చేయడం కోసం ఓ బోరు బావిని తవ్వించారు. 120 అడుగులు గల ఈ బోరు బావి తవ్విన అరగంటలోనే సాయి వర్ధన్ అనే మూడేళ్ళ బాలుడు అందులో పడిపోయాడు.
అప్పుడే బోరు బావి వర్క్ ఫినిష్ కావడంతో బావికి కేసింగ్ వెయ్యలేదు, అలాగే మిగిలిన వారంతా వారి పనుల్లో బిజీగా ఉన్నారు. దాంతో అనుకోకుండా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఆర్డీవో సాయిరామ్, పాపన్న పేట పోలీసులు వచ్చి పరిస్థిని చూసి, బాలున్ని బయటకి తీసే చర్యలు చేపట్టారు. గతంలో జరిగిన ఇలాంటి బోరు బావి ఘటనల్లో ఎక్కువమంది పిల్లలు తమ ప్రాణాలను కోల్పోయారు. పోలీసులు, రెస్క్యూ టీం చాకచక్యంతో ఈ సాయి వర్ధన్ ని కాపాడాలని కోరుకుందాం.
532320 510801Usually I dont read this kind of stuff, but this was actually intriguing! 551471