కరోనా నేపథ్యంలో 29 మ్యాచ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటమే ఇందుకు కారణం. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మ్యాచ్ లు నిర్వహించాలని ఆలోచిస్తోంది. అయితే.. ప్రస్తుత బిజీ షెడ్యూల్లో మ్యాచ్ లకు అవసరమైన టైమ్ స్లాట్ దొరకడం కష్టమనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ టోర్నీపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు.
టోర్నీని నిర్వహించలేకపోతే ఏకంగా 2500 కోట్లు నష్టమని తేల్చి చెప్పాడు. మరోవైపు మ్యాచ్ నిర్వహణకు ప్రత్యామ్నాయ తేదీలను కూడా పరిశీలిస్తున్నామని గంగూలీ వ్యాఖ్యానించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ కు స్లాట్ దొరకడం కష్టమనే భావనలో ఉన్నట్టు తెలిపాడు. అయితే.. గతేడాది వింబుల్డన్, ఒలింపిక్స్ కూడా జరగలేదు.. కాబట్టి టోర్నీ జరగ్గపోవడం ఎదురుదెబ్బ అని అనుకోవడంలేదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని కూడా అంటున్నాడు. టీ20 ప్రపంచకప్ సమయానికి పరిస్థితులెలా ఉంటాయోనని చూస్తున్నామన్నాడు.
141949 580711Fantastic internet site you got here! Please keep updating, I will def read more. Itll be in my bookmarks so far better update! 428651
283604 522714some truly interesting information , well written and broadly speaking user genial . 120932