తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం, ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ కుటుంబం గతంలో మంచి ఆస్తుపరులు. ఆయన తోబుట్టువులు మరియు ఇతర కుటుంబ సభ్యులు బాగానే సెటిల్ అయ్యారు. కాని రామకృష్ణ ఆస్తులు తరగి పోవడంతో పాటు చివరకు పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పోయాడు. పెళ్లి చేసుకోక పోవడంతో 70 ఏళ్ల ఈ వయసులో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తన సొంత గ్రామంలో ఉంటూ అడుక్కోవడం ఇష్టం లేక 12 కిలో మీటర్ల దూరంలో ఉండే ఒక ఆశ్రమంలో మద్యాహ్నం భోజనం చేసి వస్తుంటాడు.
ప్రతి రోజు ఉదయం లేచి టీ తాగి 12 కిలో మీటర్ల దూరంలో ఉండే గోపాల్ బాబా ఆశ్రమంకు వెళ్లి మద్యాహ్నంకు అక్కడ అన్నం తిని కొద్ది సమయం విశ్రాంతి తీసుకుని మళ్లీ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ తిరిగి ఇంటికి చేరుకుంటాడు. అలా ఒక్క పూట కోసం 24 కిలో మీటర్లు నడవడం గత పదేళ్లుగా ఆయనకు అలవాటు అయ్యింది. ఆశ్రమంలో ఉండమంటే తన సొంత గ్రామంలో తప్ప ఎక్కడ నిద్ర పట్టదు అంటూ రామకృష్ణ చెబుతూ ఉంటాడు. ఎండా, వానా లెక్క చేయకుండా ప్రతి రోజు కూడా 24 కిలోమీటర్ల కాలి నడక ప్రయాణంను అతడు కొనసాగిస్తూనే ఉన్నాడు. 70 ఏళ్ల వయసులో ఈ నడక ఆయనకే సాధ్యం అంటూ స్థానికులు అంటూ ఉంటారు.
643106 146983Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 137485