అసోంలో తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్థవ్యస్థం అయ్యింది. బరాక్ లోయ సమీపంలో భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. దాంతో ఆ కొండ చరియల కింద దాదాపుగా 20 మంది సజీవ సమాధి అయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న ఈ సంఘటనలతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆశ్రయం కల్పించారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి అక్కడ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొండచరియలు విరిగి పడి మృతి చెందిన 20 మందిలో ఆరుగురు ఒకే కుటుంబంకు చెందిన వారు అవ్వడంతో స్థానికంగా జనాలు తీవ్ర దుఖంలో మునిగి పోయారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. కొండ చరియలు తొలగించే పనులు జరుగుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అసోం సీఎం శర్వానంద్ సోనోవాల్ ఈ విషయమై స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చాడు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
377602 23234You got a extremely amazing site, Glad I observed it through yahoo. 822729