Switch to English

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే సాగుతున్నాయి. ఇప్పటికే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలి తీవ్ర అసహనంతో ఉన్న వైసీపీకి తెలుగుదేశం పార్టీ మరో షాక్ ఇవ్వడానికి సన్నద్ధమైంది. మండలి రద్దుకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులపై టీడీపీ విప్ ధిక్కరించి వారిద్దరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అయినప్పటికీ ఆ బిల్లు మండలిలో వీగిపోయింది. దీంతో మండలి రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. మరోవైపు పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలంటూ టీడీపీ ఇప్పటికే మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై జూన్ 3న తన ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ మండలి చైర్మన్ ఆ ఎమ్మెల్సీలను ఆదేశించారు. వారు తమ వివరణ ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేయడం ఖాయమనే చెబుతున్నారు.

అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉన్న వైసీపీకి మండలిలో బలం లేదు. దీంతో అక్కడ టీడీపీ అభీష్టం మేరకే ఏదైనా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీలపై వేటు వేయించడం లాంఛనమే అని సమాచారం. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఐదేళ్లూ గడిపేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్సీలపై సాధ్యమైనంత తొందరగా వేటు వేయించి అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని భావించడం గమనార్హం.

టీడీపీ ఎమ్మెల్యేలను అధికార పార్టీ తన వైపు తిప్పుకొంటున్న తరుణంలో ఎమ్మెల్సీలపై వేటు వేయడం ద్వారా తానేంటో చెప్పాలని భావిస్తోంది. మండలి రద్దు బిల్లు పార్లమెంటులో ఎప్పుడు ఆమోదం పొందుతుందో తెలియన పరిస్థితి నెలకొంది. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైతే మండలిని కూడా సమావేశపరచక తప్పదు. ఇది వైసీపీకి ఎంతమాత్రం ఇష్టం లేదు. సాధ్యమైనంత త్వరగా మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేసి.. రాజధాని తరలింపు మొదలుపెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వేసిన ఎత్తుగడను అధికార పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...