హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జంట నగరాల పరిధిలో గణేశ్ మహా నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ పై 40 క్రేన్లు ఏర్పాటు చేసి గణేశ్ ప్రతిమలు నిమజ్జనం చేస్తామని అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని క్రేన్ నెంబర్ 6 వద్ద నిమజ్జనం చేస్తామని అన్నారు. నిమజ్జనం సందర్భంగా 19వేల మంది పోలీసులు, ఆరోగ్య, సానిటరీ సిబ్బంది, ఆర్ అండ్ బీ, హెచ్ఎండీఏ సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
664776 44735I adore what you guys are up too. Such clever function and exposure! Maintain up the extremely very good works guys Ive incorporated you guys to my own blogroll. 495370
592858 970945Spot on with this write-up, I really suppose this web website needs rather far more consideration. most likely be once a lot more to learn much far more, thanks for that info. 854529