ఓ గనిలో కొండచరియలు విరిగిపడడంతో 160 మంది మృతి చెందారు. హృదయవిదారకమైన ఈ సంఘటన మయన్మార్ లో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది బాలురే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ మేరకు మయన్మార్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదాన్ని మయన్మార్ అగ్నిమాపక సేవా విభాగం సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
కాచిన్ రాష్ట్రంలో జేడ్ – రీచ్ హెచ్కాంత్ అనే ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా ఉంటాయి. వాటి దగ్గర బాలురు తమకు కావాల్సిన రాళ్లు ఏరుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. బాలురంతా రాళ్లు ఏరుతుండగా ఒక్కసారిగా కొండచరియలు పడినట్టు తెలుస్తోంది. కొండచరియల కింద ఎక్కువ సంఖ్యలో బాలురు ఉన్నట్టు గుర్తించారు. మొదట 100 మంది చిన్నారులు ఉంటారని భావించారు. కానీ వారి సంఖ్య 160 వరకూ ఉండటం కలచివేస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించి భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. భారీ వర్షాలు కారణంగా కొండచరియలు నాని విరిగి పడి ఉంటాయని ఆ దేశ అగ్నిమాపక సేవా విభాగం అంటోంది. దేశ సమాచార మంత్రిత్వ శాఖ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలో బాలురు ఎందుకు వెళ్లారనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఎక్కువ సంఖ్యలో మరణించారు.
332168 770310I think this really is one of the most significant information for me. And im glad reading your post. But want to remark on some common things, The web site style is perfect, the articles is really great : D. Great job, cheers 822668