తెలుగు రాష్ట్రాల్లో హెటిరో డ్రగ్స్ సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సంస్థకు చెందిన అధికారుల ఆఫీసులు మరియు ఇళ్లలో సోదాలు నిర్వహించిన తర్వాత వంద కోట్ల వరకు నగదు పట్టుబడ్డట్లుగా చెబుతున్నారు. ఆ డబ్బు విషయమై ఎలాంటి లెక్కలు చూపించడం లేదని తెలుస్తోంది. ఆ వంద కోట్ల నగదును ఏ బ్యాంక్ నుండి ఎవరు డ్రా చేశారు.. ఎలా వారి వద్దకు చేరింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను ఐటీ అధికారులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
మరో వైపు ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటించారు. సంస్థ కు చెందిన ఆఫీసులు.. అధికారుల ఇళ్లు మరియు ఇతర కుటుంబ సభ్యులు మరియు బంధువులకు చెందిన ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సోదాలకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అధికారులు పూర్తి స్థాయిలో వెళ్లడించలేదు. సోదాలు పూర్తి అయిన తర్వాతే వారు మీడియా ముందుకు వస్తారనే సమాచారం అందుతోంది.
260688 461603hey there, your web site is fantastic. I do thank you for function 370777
953825 278316Really informative post. Your current Site style is awesome as well! 168488