గత ఏడాది చివర్లో పుట్టిందో లేదా ఈ ఏడాది ఆరంభంలో పుట్టిందో కాని కరోనా వైరస్ ఏడాది తిరగకుండానే మిలియన్ మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా కరోనా బారిన పడ్డాయి. అందులో కొన్ని దేశాలు కరోనాను జయించగా మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా కరోనాతో అల్లాడుతూనే ఉన్నాయి.
నిన్నటితో కరోనా మృతుల సంఖ్య అధికారికంగా పది లక్షలను క్రాస్ చేసింది. అనధికారికంగా కరోనా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే అయ్యి ఉంటుంది అనేది కొందరి వాదన. పది లక్షల మందిలో సగానికి పైగా అమెరికా, ఇండియా, బ్రెజిల్ మరో రెండు దేశాలకు చెందిన వారే. కరోనా పుట్టిన చైనాలో మాత్రం మృతుల సంఖ్య అయిదు వేల లోపే. అధికారికంగా అక్కడ పాజిటివ్ కేసులు కూడా 90 వేల లోపే.
చైనా నిజం చెబుతుందా అబద్దం చెబుతుందా అనే విషయాన్ని అటు ఉంచితే వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా కనీసం అయిదు ఆరు నెలలు పడుతుందని, వ్యాక్సిన్ వచ్చినా అందరికి అందుబాటులో రావడానికి 2021 మొత్తం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అప్పటి వరకు ఈ సంఖ్య మరెంతగా అవుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది.
827984 423634I like this site so significantly, saved to favorites . 138027
310268 801177This is a very good common sense write-up. Really beneficial to one who is just locating the resouces about this part. It will certainly support educate me. 299637
518386 767811Would really like to always get updated great internet site ! . 283834