అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో నేటి నుంచి 5రోజులపాటు ఆలయాల ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డికి మెగస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. రఘువీరా స్వగ్రామంలో పురాతన ఆలయాల పునరుద్దరణపై ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధారణ, నూతన ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశంలో చిరంజీవి స్పందించారు.
కరోనా సమయంలో రాలేకపోతున్నానని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత తప్పక వస్తానని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. చిరంజీవి ఇంకా మాట్లాడుతూ.. రఘువీరాతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రస్థనంలో అతి తక్కువ సమయంలోనే రఘువీరా తనకు ఎంతో ఆప్తుడయ్యారని అన్నారు.