జగన్మోహన్ రెడ్డి తీరూ, సైకో మనస్తత్వం మధ్య పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పదేళ్లుగా చెబుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్ తన ఆత్మకేంద్రీకృత ఆలోచనలను రాష్ట్రానికి బహిరంగంగా చూపించాడని వారు అంటున్నారు.
తాను చేసిన తప్పులు, స్కాంలు, హత్యల కేసులు, లేదా తన నేర చరిత్రపై ప్రశ్నించిన వారిని ఇబ్బందిపెట్టడం, అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం లాగా నమ్మించడం జగన్ సహజ స్వభావం.
చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు జగన్ తప్పులను బహిర్గతం చేసిన ప్రతిసారి అక్రమ కేసులు పెట్టి వేధించాడు. గొంతు ఎత్తిన వారిని అణగదొక్కాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు లిక్కర్ స్కాంలో విచారణ సాగుతుండగా, జగన్ దిశలోనే అన్ని ఆధారాలు చూపుతున్నాయి. అయినా జగన్ తనపై ఉన్న ఆరోపణలను తప్పించుకోవడానికి, ఈ కేసును చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై నెట్టేస్తున్నాడు.
లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రధారి వెంకటేష్ నాయుడు. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు-వెంకటేష్ నాయుడు ఫోటోలు చూపించి అబద్ధ ప్రచారం చేస్తోంది. కానీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని అందరికీ తెలిసిందే.
వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి డమ్మీగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగా, వైసీపీ అనుమతి లేకుండా అది సాధ్యమేనా? జగన్ ప్రమేయం లేకుండా వెంకటేష్ నాయుడు ఇంతటి సన్నిహిత సంబంధాలు కలిగించగలడా? అసలు ప్రశ్న ఇది.
చంద్రబాబు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా కలుస్తాడు. అలాంటి సందర్భంలో తీసిన ఒక ఫోటో ఆధారంగా జగన్ చేస్తున్న దుష్ప్రచారం హాస్యాస్పదం.
వెంకటేష్ నాయుడు తన అఫిడవిట్లో కేవలం రూ.4.59 లక్షల వార్షిక ఆదాయం చూపించాడు. కానీ కోట్లలో డబ్బులు, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు… ఇవన్నీ జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారం లేకుండా సాధ్యమా?
ఇదే కాకుండా, గతంలో వివేకా హత్య కేసులో కూడా జగన్ మొదట చంద్రబాబుపై నెట్టేసి, తరువాత నిజం బయటపడగానే మాట మార్చిన సంగతి ప్రజలు మరచిపోలేదు. ఇప్పుడు కూడా లిక్కర్ స్కాంలో అదే పద్ధతిని పునరావృతం చేస్తున్నాడు.
ప్రకాశం బ్యారేజ్ ఘటనలో కూడా జగన్ ప్రభుత్వం నారా లోకేష్ గారిపై తప్పుడు ఆరోపణలు చేసింది. కానీ వాస్తవాలు బయటపడి ఆ కుట్ర వెనుక వైసీపీ వ్యక్తులే ఉన్నారని తేలింది.
ఇలాంటి తప్పుడు ఆరోపణలు, అబద్ధాల రాజకీయాలు, సైకో తత్వం ఉన్న జగన్ను రాష్ట్ర ప్రజలు 2024లోనే గట్టిగా కొట్టారు. అయినా కూడా జగన్ మారలేదు.
లిక్కర్ స్కాంను చంద్రబాబుపై నెట్టే జగన్ మూర్ఖపు ప్రయత్నాలను ప్రజలు మళ్లీ ఖండించాల్సిన సమయం వచ్చిందనీ.. కూటమి నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
